లోకేశ్వరం నవంబర్ 26
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె గౌతం,ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత దేశ రాజ్యాంగ 75 వ ఆమోద దినోత్సవం పురస్కరించుకొని గొప్ప సభ జరిగింది.ఈ సభలో అధ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలు చక్కగా వివరించారు. దేశభక్తి అంటే కులమతాలకు అతీతంగా భారతీయ పౌరులందరిని సోదరులుగా ప్రేమించడం భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించడం దానిని కచ్చితంగా అమలు చేయడం దేశభక్తి అని అధ్యాపకులు విద్యార్థులకు బోధించారు సరిగ్గా ఇదే రోజు 75 సంవత్సరాల క్రితం దాదాపు భారతదేశంలో 80 శాతం మంది ప్రజలకు పుట్టినరోజు అని వివరించారు. ఆధునిక భరతజాతి గమన విధాత అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ .. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగ భారతదేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్ది.. ఆ రాజ్యాంగాన్ని స్వేచ్ఛ సమానత్వము న్యాయము లౌకికవాదము గణతంత్రము స్వామివాదం అనే పునాదుల పైన నిలబెట్టినటువంటి మహానుభావుడు అని కీర్తించారు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు ఒకటి తలపెట్టవోయ్. మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒకటే నిలిచి ఉండును అన్న గురజాడ వారి మాటలకు స్ఫూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర అని అధ్యాపకులు వివరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధునిక భారతజాతి పిత అని. ప్రపంచ మేధావి గొప్ప రాజకీయ దురంధరుడు గొప్ప న్యాయవాది ప్రజాస్వామ్యవాది లౌకికవాది మానవతావాది.. భారతదేశంలో నివసిస్తున్న 80% శూద్రులకు అతిశూద్రులకు మానవ హక్కులను ప్రసాదించి రక్షించిన రక్షకుడు. 80% భారతీయుల చీకటి జీవితాల్లో వెలుగును నింపేందుకు తన కుటుంబాన్ని తన ఆరోగ్యాన్ని సర్వాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె గౌతం,ఏం చిన్నయ్య,జి .శ్రీనివాస్,ఏన్ వెంకటేశ్వర్లు, విఠల్, వినోద్, ప్రమీలరాణి, నవీన్, మహేందర్, సాయినాథ్, హరీష్, మరియు బోధన సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.