ఎల్లారెడ్డి, జనవరి 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో, సోమవారం ఉదయం ఓ మహిళ కడుపులోంచి అరుదైన ఆపరేషన్ నిర్వహించి 7.750 కేజీల బరువు కలిగిన కణితిని తొలగించినట్లు ఆసుపత్రి వైద్యులు సర్జన్ రవీంద్ర మోహన్ తెలిపారు. మహ్మద్ నగర్ మండలం తున్కిపల్లి గ్రామానికి చెందిన అబీదా బేగం (41) 2 రోజుల క్రితం కడుపు నొప్పితో ఆసుపత్రికి రావడం జరిగిందని వైద్యులు తెలిపారు. గత 6 నెలలుగా కడుపు నొప్పితో బాధ పడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నొప్పి ఎంత వరకు తగ్గక పోవడంతో తన ఆసుపత్రికి (సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి) రావడం జరిగిందని తెలిపారు. ఆమెను పరీక్షించి అబ్దామిన్ స్కానింగ్ చేసి, సిటి స్కాన్ అబ్డామిన్ చేసి చూడగా కడుపులో అండాశయ కణితి గర్భ సంచి కణితి ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. దీన్ని ఆపరేషన్ చేసి తొలగించడం ఏకైక మార్గం అని కుటుంబ సభ్యులకు వివరించారు. భర్త షబ్బీర్ అనుమతితో ఆపరేషన్ నిర్వహించి, అబీదా బేగం కడుపులోంచి 7.750 కేజీల కణితిని తొలగించినట్లు వైద్యులు సర్జన్ రవీంద్ర మోహన్ తెలిపారు. అపరేషన్ అనంతరం అబేదా ఆరోగ్యం నిలకడగా ఉండి కోలుకుం టుందని వైద్యులు వివరించారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్ సర్జన్ రవీంద్ర మోహన్, డాక్టర్ సిద్దిరాములు, డాక్టర్ మక్బూల్ (మత్తు డాక్టర్) సిబ్బంది పాల్గొన్నారు.

