రెండు కేంద్రాల్లో కలిపి 11 మంది గైర్హాజరు…
హుషారుగా కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు…
– రెండు పరీక్ష కేంద్రాల సీఎస్ డీఓ లు
ఎల్లారెడ్డి, మార్చి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల “ఎ” , ఆదర్శ కళాశాల “బి” పరీక్ష కేంద్రాల్లో, ఫిబ్రవరి 29 వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ పరీక్షలు, గురువారం నాడు 12 వ రోజు ద్వితీయ సంవత్సర పార్ట్ 3, కెమిస్ట్రీ2, కామర్స్ 2, (వొకేషనల్) ( సెట్ “బి” ) పరీక్ష ప్రశాంతంగా ముగిశాయని “ఎ “, “బి” పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓ లు సి హెచ్. హే మాచందర్, పి.సాయిబాబా, స్వప్న , పద్మ లు తెలిపారు. ” ఏ ” కేంద్రంలో 236 మందికి 231 మంది హాజరు కాగా 05 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. వొకేషనల్ 22 మందికి గాను 18 మంది పరీక్షకు హాజరు కాగా , 04 గురు గైర్హాజరు అయ్యారు. “బి” కేంద్రంలో 216 మంది విద్యార్థులకు గాను 214 మంది హాజ కాగా ఇద్దరు విద్యార్థులు పరీక్షకు గైర్హాజయ్యారు. రెండు కేంద్రాల్లో కలిపి 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సీఎస్, డీఓ లు తెలిపారు. పరీక్షలను ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా, ఒక్కో విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రం లోనికి పంపించి, పక డ్బందీగా పరీక్ష నిర్వహించడం జరిగిందని సిఎస్, డి ఓ లు తెలిపారు. రెండు కేంద్రాల వద్ద పరీక్ష ముగిసేంత వరకు మత్తమాల పి హెచ్ సి ఆరోగ్య సిబ్బంది అవసరమైన ప్రాథమిక చికిత్సల మందులతో అందుబాటులో ఉన్నారు. ద్వితీయ సంవత్సర (వొకేషనల్ పరీక్ష మినహాయించి) పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ, హుషారుగా ఒకరికొకరు పరీక్షలు ఎలా రాసావు అనే విషయాలు చర్చించుకుంటూ ఇంటికి వెళ్ళారు.