Home తాజా వార్తలు ఈనెల 27 నాడు చలో గాంధారి

ఈనెల 27 నాడు చలో గాంధారి

by Telangana Express

కామారెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్ జూలై 17

   కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ &బి గెస్ట్ హౌస్ లో జిల్లా స్థాయి సమావేశము జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ గార్లు  మాట్లాడుతూ……. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో గిరిజన గర్జన సభ పెట్టాలని నిర్ణయించినాము సభ జరిగే సమయము తేదీను ప్రకటించడం జరిగింది .ఈనెల తేదీ 27/7/2025 ఆదివారం రోజున మారుతి ఫంక్షన్ హాల్ లో సభ జరుగును . *సదస్సుకు ముఖ్యఅతులుగా డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్ గారు,గిరిజన కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు వస్తున్నారని వారు తెలియజేశారు.*
ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం
1 ) ధర్మ సమాజ్ పరిరక్షణ కోసమై
2 ) పోడు భూములు అసైన్మెంట్ భూములపై అవగాహన కల్పించుట
3 ) గిరిజన సమస్యలపై రాజ్యాంగంలో 8 షెడ్యూల్లో గోరు బోలి భాషను చేర్చాలని  భారీ సదస్సు నిర్వహిస్తున్నాము..

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్.
గౌరవ అధ్యక్షులు  రూప్ సింగ్ నాయక్. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  శంకర్ నాయక్.  నాయకులు ప్రేమ్,  ప్రకాష్ నాయక్ , విజయ్, రవీందర ,శ్రీను నాయక్, పీర్ సింగ్ నాయక్, పరశురాం బన్సీలాల్ నాయక్, దేవి సింగ్,  మోహన్ , గోపి నాయక్ ,
వసంత్ పాల్గొన్నారు

You may also like

Leave a Comment